‘వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే’ అవగాహన ర్యాలీ

‘వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే’ అవగాహన ర్యాలీ

వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే’ సందర్భంగా శుక్రవారం మాదాపూర్​లోని  మెడికవర్ హాస్పిటల్స్​ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. మెడికేషన్ వితౌట్ హోమ్, మెడికేషన్ సేఫ్టీ నినాదాలతో మెడికవర్ హాస్పిటల్స్​ డాక్టర్లు, స్టాఫ్ సిటిజన్లకు అవగాహన కల్పించారు. అనంతరం శరత్ రెడ్డి మాట్లాడుతూ..అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తీసుకునే మెడిసిన్స్​పై పర్యవేక్షణ లేకపోతే మరింత ప్రమాదమన్నారు. అందుకే మెడికేషన్ వితౌట్ హోమ్​ నినాదాన్ని థీమ్​గా ఎంచుకున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాకేశ్, సెంటర్​ హెడ్ డాక్టర్ మాతా ప్రసాద్, డాక్టర్ అనూష, సిబ్బంది పాల్గొన్నారు. - వెలుగు,మాదాపూర్