దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియా ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫస్ట్ ఎడిషన్ లో రన్నరప్ గా నిలిచిన ఇండియా ఖాతాలో 49.7 పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ (పీసీటీ) ఉన్నాయి. ఇప్పటివరకు 9 టెస్టులు ఆడిన టీమిండియా.. ఈ ఎడిషన్లో 4 గెలవగా, మూడింటిలో ఓడింది. దీని ప్రకారం అత్యధికంగా 53 పాయింట్లు ఖాతాలో ఉన్నా.. పీసీటీని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే వచ్చే నెలలో లంకతో జరిగే రెండు టెస్ట్ల సిరీస్లో విక్టరీ సాధిస్తే.. రోహిత్సేన ప్లేస్ మెరుగయ్యే చాన్స్ ఉంది. ప్రస్తుతం లంక 100 పీసీటీతో టేబుల్ టాపర్గా కొనసాగుతున్నది.