
ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన చిత్రం ‘గం గం గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్స్. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఆనంద్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటిదాకా రియలిస్టిక్, నేచురల్ మూవీస్ చేశాను. ‘గం గం గణేశా’లో ఎనర్జిటిక్ క్యారెక్టర్తో వస్తున్నా. ఇది టిపికల్ జానర్ మూవీ.
క్రైమ్ కామెడీ కథతో ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ‘ఈ మూవీలో చాలా షేడ్స్ ఉంటాయి. స్పైసీ, స్వీట్, థ్రిల్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’ అని హీరోయిన్ నయన్ సారిక చెప్పింది. డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ ‘సినిమాలను క్లాస్, మాస్ అని విభజిస్తాం. కానీ మా మూవీ క్లాస్, మాస్ అంశాలు కలిపి ఉంటుంది. గణేష్ ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు ఎంత ఎనర్జిటిక్గా జరుపుకుంటారో అంతే ఎనర్జీ మా మూవీలో ఉంటుంది’ అని చెప్పాడు.
సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు వంశీ కారుమంచి, కేదార్ సెలగం అన్నారు. కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, నటులు యావర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.