
యాదాద్రి, వెలుగు : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ఏ.భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పెరిగిన కలుపు మొక్కలను తొలగించాలని సూచించారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికపుడు శుభ్రం చేయించాలన్నారు. హాస్టల్స్ లో మంచి నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రపరచాలన్నారు. ప్రతి ఫ్రైడే ను- డ్రై డే గా పాటించాలన్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయాలని ఆదేశించారు.
భూసమస్యలు పరిష్కారం..
భూభారతి చట్టంతో భూములు సమస్యలు పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. వలిగొండ, బీబీనగర్ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆఫీసర్లు ఇంటి వద్దకే అప్లికేషన్లు తీసుకొని, వివాదాలు లేని సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని చెప్పారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో సునంద, డీఎంహెచ్వో మనోహర్, మిషన్ భగీరథ ఆఫీసర్ కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.