వానాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ఏ.భాస్కర్రావు

వానాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ఏ.భాస్కర్రావు

యాదాద్రి, వెలుగు : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్​ఏ.భాస్కర్​రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పెరిగిన కలుపు మొక్కలను తొలగించాలని సూచించారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికపుడు శుభ్రం చేయించాలన్నారు. హాస్టల్స్ లో మంచి నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రపరచాలన్నారు. ప్రతి ఫ్రైడే ను- డ్రై డే గా పాటించాలన్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయాలని ఆదేశించారు. 

భూసమస్యలు పరిష్కారం..

భూభారతి చట్టంతో భూములు సమస్యలు పరిష్కారమవుతాయని అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి తెలిపారు. వలిగొండ, బీబీనగర్​ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆఫీసర్లు ఇంటి వద్దకే అప్లికేషన్లు తీసుకొని, వివాదాలు లేని సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని చెప్పారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో శోభారాణి, డీపీవో సునంద, డీఎంహెచ్​వో మనోహర్, మిషన్​ భగీరథ ఆఫీసర్ కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.