
యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఎండాకాలం సెలవులు ముగిశాయి. గురువారం నుంచి 2025-–26 ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమవుతోంది. దీంతో గవర్నమెంట్ స్కూల్స్ను శుభ్రం చేశారు. పంచాయతీ, మున్సిపాలిటీ స్టాఫ్తో పరిసరాల్లో చెత్తాచెదారం తొలగించారు. స్కూల్స్రూమ్స్లో పేరుకుపోయిన దుమ్మును దులిపి శుభ్రం చేశారు. మరుగుదొడ్లను శుభ్ర పరిచారు. మధ్యాహ్న భోజనం కోసం వంట గిన్నెలను కడిగారు.
స్కూల్స్ స్టార్ట్ కాగానే స్టూడెంట్స్కు టెక్స్ట్, నోట్బుక్స్ తోపాటు స్కూల్ డ్రెస్సులు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బడిబాటలో గుర్తించిన స్టూడెంట్స్ను ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చుకుంటున్నారు. యాదాద్రి జిల్లాలో స్టూడెంట్స్ లేకపోవడంతో గతంలో మూతపడిన స్కూల్స్ను తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. దీంతో ఇప్పటికే మూతపడిన బొమ్మలరామరం, ఆలేరు, బీబీనగర్ మండలాలోని ఆరు స్కూల్స్గురువారం రీ ఓపెన్ కానున్నాయి.