స్కూల్స్ స్టార్ట్ చెత్తాచెదారం తొలగింపు..దుమ్ము దులిపి శుభ్రం

 స్కూల్స్ స్టార్ట్ చెత్తాచెదారం తొలగింపు..దుమ్ము దులిపి శుభ్రం

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఎండాకాలం సెలవులు ముగిశాయి. గురువారం నుంచి 2025-–26 ఎడ్యుకేషన్ ఇయర్​ ప్రారంభమవుతోంది. దీంతో గవర్నమెంట్ స్కూల్స్​ను శుభ్రం చేశారు. పంచాయతీ, మున్సిపాలిటీ స్టాఫ్​తో పరిసరాల్లో చెత్తాచెదారం తొలగించారు. స్కూల్స్​రూమ్స్​లో పేరుకుపోయిన దుమ్మును దులిపి శుభ్రం చేశారు. మరుగుదొడ్లను శుభ్ర పరిచారు. మధ్యాహ్న భోజనం కోసం వంట గిన్నెలను కడిగారు. 

స్కూల్స్ స్టార్ట్​ కాగానే స్టూడెంట్స్​కు టెక్స్ట్, నోట్​బుక్స్ తోపాటు స్కూల్​ డ్రెస్సులు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బడిబాటలో గుర్తించిన స్టూడెంట్స్​ను ఈ ఎడ్యుకేషన్​ ఇయర్​లో గవర్నమెంట్​ స్కూల్స్​లో చేర్చుకుంటున్నారు.  యాదాద్రి జిల్లాలో స్టూడెంట్స్​ లేకపోవడంతో గతంలో మూతపడిన స్కూల్స్​ను తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. దీంతో ఇప్పటికే మూతపడిన బొమ్మలరామరం, ఆలేరు, బీబీనగర్ మండలాలోని ఆరు స్కూల్స్​గురువారం రీ ఓపెన్​ కానున్నాయి.