బీజేపీలో చేరిన యాలాల ఎంపీపీ

బీజేపీలో చేరిన యాలాల ఎంపీపీ

వికారాబాద్,  వెలుగు :  జిల్లాలోని యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సోమవారం బీజేపీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ  బలపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే స్థానాల్లో చేవెళ్ల పార్లమెంట్ కూడా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరుణం ప్రహ్లాదరావు, శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.