వైసీపీ నేతలు దాడికి దిగారని.. టీడీపీ నేతల ధర్నా

వైసీపీ నేతలు దాడికి దిగారని.. టీడీపీ నేతల ధర్నా

ఏపీలో ఎన్నికలు పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా.. అక్కడి ఉద్రిక్త వాతావరణం ఇంకా అలానే ఉంది. తాజాగా ఆదివారం నాడు నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై అక్కడి వైసీపీ నేతలు దాడికి దిగారు.  మొన్నటి ఎన్నికలలో తమకు అనుకూలంగా పనిచేయలేదని వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లుగా టీడీపీ నేతలు అంటున్నారు. విచక్షణారహితంగా దాడికి దిగడంతో తిరుమల నాయుడు పరిస్థితి విషమంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

దీంతో  టీడీపీ శ్రేణులు వైసీపీ నేత శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.ఈ  దాడికి పాల్పడిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాయుడుపై రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.