మాదాపూర్, వెలుగు: కరెంట్ షాక్తో యువకుడు చనిపోయిన ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా పాలకొడేరు గ్రామానికి చెందిన బి. వీర వెంకట దుర్గారావు(23) కొంతకాలం కిందట సిటీకి వచ్చి ఈసీఐఎల్లో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. రెండ్రోజులుగా మాదాపూర్ మెరిడియన్ స్కూల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ వద్ద పనిచేస్తున్నాడు.
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గారావు నిర్మాణ స్థలం వద్ద విద్యుత్ వైర్లను తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కరెంట్ షాక్ తగిలింది. తోటి కార్మికులు దుర్గారావును హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.