బాయ్ ఫ్రెండ్ ను ఇరికించేందుకు గ్యాంగ్ రేప్ డ్రామా..

బాయ్ ఫ్రెండ్ ను ఇరికించేందుకు గ్యాంగ్ రేప్  డ్రామా..

హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఆటో ఎక్కిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు నిన్న పోలీసులకు ఓ కంప్లయింట్ వచ్చింది. సంతోష్ నగర్ లో ఆటో ఎక్కిన ఓ ల్యాబ్ టెక్నీషియన్.. తనను ముగ్గురు ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు తెలిపింది. తల్లితో కలిసి కంప్లయింట్ చేసింది. పలు సీసీ ఫుటేజ్ లు పరిశీలించిన పోలీసులు... ఈ కంప్లయింట్ లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. బాయ్ ఫ్రెండ్ కు మరో వివాహం నిశ్చయం కావడంతో... అతడిని కేసులో ఇరికించేందుకు ఇలా డ్రామా ఆడిందని పోలీసులు తేల్చారు.

ఫిబ్రవరిలో కూడా ఘట్ కేసర్ లో ఇలాంటి కేసే నమోదైంది. ఈ సంఘటన తర్వాత విషాదాంతమైంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఫార్మసీ విద్యార్థిని... తనపై ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు.. ఇది తప్పుడు ఆరోపణ అని క్లారిటీ ఇచ్చారు. ఫార్మసీ విద్యార్థిని అందర్నీ తప్పుదోవ పట్టించిందన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. విద్యార్థినికి కిడ్నాప్ లంటే ఇష్టమని... అంతకుముందు కూడా ఓసారి నాటకమాడిందని చెప్పారు. ఎలాగైనా ఇంట్లోనుంచి బయటపడాలనే ఈ కిడ్నాప్ స్టోరీ అల్లిందని తెలిపారు. అమ్మాయి చెప్పినట్లు రేప్, కిడ్నాప్ జరగలేదని స్పష్టం చేశారు సీపీ. ఆటో డ్రైవర్లకు కేసుతో సంబంధం లేదని చెప్పిన సీపీ.. వారందరికీ క్షమాపణ చెప్పారు. ఐతే.. ఈ సంఘటన వైరల్ కావడంతో.. అవమాన భారంతో.. ఫార్మసీ స్టూడెంట్ కొద్దిరోజులకే సూసైడ్ చేసుకుని చనిపోయింది.