హైదరాబాద్: కుటుంబ గొడవల కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని తెలంగాణ పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ చెందిన ఒక అమ్మాయి ఇంట్లో గొడవలతో మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకోవాలనుకుంది. ఇంట్లోంచి బయల్దేరిన ఆ యువతి గోదావరి బ్రిడ్జివైపు నడుచుకుంటూ రావడంతో.. అక్కడే చెక్ పోస్ట్ లో డ్యూటీలో ఉన్న ఎస్సెలు మంగిలాల్, విజేందర్ లు ఆమెను ప్రశ్నించారు. క్షణికావేశంతో ఇంట్లోంచి వస్తున్నట్లు గుర్తించి.. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పేరెంట్స్ కు అప్పగించారు. ఈ ఘటన ఫొటోలను రామగుండం కమిషనర్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా దీనిపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఎస్సైలిద్దరినీ మెచ్చుకున్నారు. విభేదాలు, అపార్థాలు విపరీతమైన భావోద్వేగాలకు దారితీస్తాయని, ఇది ఎవరికైనా ప్రమాదమేనని ట్వీట్లో పేర్కొన్నారు. కొద్ది నిమిషాలు ఆలోచించడం సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు.
Extreme Emotions led by conflicts/misunderstandings can be harmful to oneself. Taking a pause,holding back for a while can solve many issues.
Your Immediate attention & consoling words to the one in distress is the Right Move Dear Officers, Vijendar & Mangilal. https://t.co/BOiNV5Yjab— DGP TELANGANA POLICE (@TelanganaDGP) April 25, 2020