పాదయాత్రకు అనుమతి నిరాకరణ.. షర్మిల నిరసన

పాదయాత్రకు అనుమతి నిరాకరణ.. షర్మిల నిరసన

వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు ఆమె దీక్షకు దిగారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్ కు తరలించారు. 

షర్మిల లోటస్ పాండ్ వద్ద దీక్ష కొనసాగిస్తూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే యాత్రను అడ్డుకున్నారన్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన తెలిపారు.