తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ కంపర రమేశ్ దారుణ హత్య కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో కార్పొరేటర్ రమేశ్ ను దారుణంగా అతనిని కారుతో గుద్ది పలుసార్లు తొక్కించి హత్యచేశాడు. కాకినాడలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గురువారం అర్ధారాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆయనను ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
కాకినాడ పోలీసుల వివరాల ప్రకారం గురువారం అర్దరాత్రి కాకినాడ రూరల్ గంగరాజునగర్ రోడ్డు నంబరు 9 వద్ద ఉన్న సూర్య వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద ముత్యాల సతీష్, సుందర్, వాసు కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. పార్టీ అయినా తరువాత కంపర రమేష్ ను గురజాడ చిన్ని తన ఇంటిలో పుట్టినా రోజు వేడుకలకు రమ్మని పిలిచారు. కంపర రమేశ్ రావడం కుదరదని చెప్పడంతో గురజాడ చిన్ని రమేష్ ని కారుతో గుద్ది తొక్కించి అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న కంపరా రమేష్ ను ట్రస్టు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
కంపర రమేష్.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం ఛైర్మన్గా పనిచేశారు. ఇంతకు ముందు ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1992లో ఎన్ఎస్యూఐ కాకినాడ నగర అధ్యక్షుడిగా,1995లో తూర్పు గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పని చేశారు .2000లో కాకినాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా పని చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరారు.