కేసీఆర్ దొరకు రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు వద్దు: షర్మిల

కేసీఆర్ దొరకు రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు వద్దు: షర్మిల

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు.    

వడ్లు మొలకెత్తి గుండె భారమై ఓ కౌలు రైతన్న ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. చనిపోతానని రైతు ముందే చెప్పినా..ఆదుకోని అసమర్థ ప్రభుత్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ది  కండ్లు ఉన్నా చూడలేని సర్కారని...చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమని మండిపడ్డారు. కేసీఆర్ దొరకు..రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దని విమర్శించారు.

కేసీఆర్ కు  ఓట్ల కోసం  రైతు నినాదం కావాలి  కానీ ఆదుకునే విధానం వదని ఎద్దేవా చేశారు షర్మిల. కేసీఆర్ సిగ్గుపడాలని  తొమ్మిదేళ్లలో 9 వేల మంది రైతులను బలి తీసుకున్న కేసీఆర్.. మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లు అన్ని తెరవాలని.. క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపాలన్నారు. తడిసిన వడ్లు సైతం కొనాలన్నారు.  

ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.  ఇప్పటికే 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ దని ధ్వజమెత్తారు షర్మిల.