కేసీఆర్ది కిసాన్ కిల్లర్ సర్కార్: వైఎస్ షర్మిల

కేసీఆర్ది కిసాన్ కిల్లర్ సర్కార్: వైఎస్ షర్మిల

బీఆర్ఎస్, బీజేపీ కలిసి రైతులను బలిచేయాలని చూస్తున్నాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు చనిపోతే కేసీఆర్ సర్కార్ ఆదుకుందా అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరేనని.. వడ్లు కొనకుండా, కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతే ఏ రోజైనా పట్టించుకున్నారా అని అడిగారు. రైతు బతికున్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం.. చస్తే మాత్రం 5లక్షలు ఇస్తుందన్నారు. 

కేసీఆర్ది కిసాన్ కిల్లర్ సర్కార్ అని షర్మిల విమర్శించారు.  రైతులు ధర్నాలు చేయాల్సింది ప్రగతిభవన్, ఫాంహౌస్ ముందని చెప్పారు. రైతుల పేరిట అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేసిన బీఆర్ఎస్ ను రైతులు ఉతికి ఆరేయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ  రైతు ద్రోహి అని..ఈ రైతు హంతక ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని  అన్నారు.