టీమిండియాను చూసి ప్రత్యర్థులు జడుసుకుంటున్నారు 

టీమిండియాను చూసి ప్రత్యర్థులు జడుసుకుంటున్నారు 

న్యూఢిల్లీ: టీమిండియాను చూసి మిగతా జట్లు భయపడుతున్నాయని పేసర్ మహ్మద్ షమి అన్నాడు. ఈమధ్య కాలంలో మన బౌలింగ్ దళం బలోపేతంగా మారిందని చెప్పాడు. దీంతో భారత్ కోసం ఏ వికెట్‌‌ను సిద్ధం చేయాలో తెలియక ప్రత్యర్థులు తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నాడు. 

‘మన జట్టులోని పేసర్లు, స్పిన్నర్లు మంచి ఫామ్‌‌లో ఉన్నారు. వీరిని చూసి విదేశీ జట్లు కన్ఫ్యూజన్‌కు గురవతున్నాయి. భారత్‌‌ను ఓడించేందుకు ఎలాంటి వికెట్‌ను రెడీ చేయాలో వారికి తెలియట్లేదు. టర్నింగ్ ట్రాక్‌ను సిద్ధం చేద్దామంటే మన స్పిన్నర్ల తడాఖా ఏంటో వారికి తెలుసు కాబట్టి ఆ పని చేయలేరు. ఇప్పుడు సీమింగ్ ట్రాక్‌‌ పైనా మన స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ఇక టీమిండియా పేసర్లు ఆ ట్రాక్స్‌ మీద ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌ను ఊపిరి తీసుకోనివ్వరనేదీ వారికి తెలుసు’ అని షమి పేర్కొన్నాడు.