
నిజామాబాద్, వెలుగు: ఈనెల 29న పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సభా ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్తో కలిసి పరిశీలించారు. పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభించడానికి అమిత్షా వస్తుండగా రైతు సభ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు ఎలా ఉండాలో ఏసీపీ రాజావెంకట్రెడ్డితో కలిసి చర్చించారు.