నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని నిజామాబాద్అడిషనల్ కలెక్టర్ భుజంగరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కాంట్రాక్ట్ ఏజెన్సీలు తాజా కాయగూరలు, పండ్లు, చికెన్, మటన్ తీసుకురావాలని, రూల్స్ పాటించకుంటే ఏజెన్సీని రద్దు చేస్తామని హెచ్చరించారు. ట్రైనీ కలెక్టర్ సురేశ్, డీఈవో అశోక్ పాల్గొన్నారు.
