మేమంతా నీ సైన్యమే.. బాహుబలి

మేమంతా నీ సైన్యమే.. బాహుబలి
  • నీరజ్ చోప్రాకు ఎక్స్ యూవీ 700 మోడల్ బహుమతి ప్రకటించిన ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తున్న నేపధ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు.  ‘‘మేమంతా నీ సైన్యంలో ఉన్నాం.. బాహుబలి..’’ అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ ఈటెను పైకెత్తి గుర్రంపై వస్తున్న ఫోటో పక్కన.. ఒలింపిక్స్ లో ఈటె విసరుతున్న నీరజ్ చోప్రా ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు బదులిస్తూ.. నీరజ్ చోప్రాకు ఎక్స్ యూవీ 700 వెహికల్ బహుమతిగా ఇవ్వాలని కోరాడు. నెటిజన్ కోరికకు ఆనంద్ మహీంద్రా బదులిస్తూ.. మరో ట్వీట్ చేశారు. నీరజ్ కోసం ఓ ఎక్స్ యూవీ 700 మోడల్ వాహనాన్ని రెడీ చేయాలంటూ.. తన సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగును ట్యాగ్ చేశారు. రూ.20 లక్షల విలువైన ఈ కొత్త మోడల్ ను నీరజ్ కు బహుమతిగా ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆనంద్ మహీంద్రా ఇప్పటికే పలు బహుమతులు ప్రకటించిన విషయం తెలిసిందే.