కాసేపట్లో చిన్నారి అంత్యక్రియలు

కాసేపట్లో చిన్నారి అంత్యక్రియలు

జవహార్ నగర్ చిన్నారి ఇందు అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. పాప ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. జవహర్ నగర్ స్మశానవాటిక వరకు ఈ యాత్ర సాగనుంది. అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మొహరించారు.

చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణసాయంగా లక్షా 10వేల రూపాయలను అందజేశారు. మిగితా ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలలో సీటు ఇప్పిస్తామని హమీ ఇచ్చారు. పాఠశాలలో సీసీటీవి కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. అదేవిధంగా సీపీతో మాట్లాడి గంజాయి సమస్య లేకుండా చూస్తామన్నారు.