కేసీఆర్ కావాలనే బీజేపీపై కుట్రలు

 కేసీఆర్ కావాలనే బీజేపీపై కుట్రలు

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో 2014లో బీజేపీ సర్కారు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ వడ్లు కొనుగోలు చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే చెప్పారు. మోడీ చరిత్రలో అవినీతికి తావులేదని, సీఎం కేసీఆర్ కావాలనే బీజేపీపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆయన ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆహార భద్రత కార్యక్రమం పక్కాగా అమలు చేస్తున్నామని, ఐసీడీసీ అంగన్​వాడీల ద్వారా పిల్లలకు, గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నామని చౌబే గుర్తు చేశారు. త్వరలో గ్రీన్ ఎనర్జీతో సోలార్ విద్యుత్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పారు. కార్బన్ ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకొస్తామన్నారు. పరిశ్రమల వ్యర్థాలను మూసీ, హుస్సేన్ సాగర్ లోకి వదలడం వల్ల నీళ్లు పొల్యూట్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చానని, సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని చౌబే అన్నారు.