దుర్మార్గుల పాలనను తరిమికొట్టండి : ఆకునూరు మురళి

దుర్మార్గుల పాలనను తరిమికొట్టండి : ఆకునూరు మురళి

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నిసార్లు వీళ్లకు అవకాశం ఇవ్వాలి”అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి అన్నారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన వీడియోలను శుక్రవారం మురళి తన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశారు.

రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా కల్పించాలనే దానిపై గత తొమ్మిదిన్నర ఏండ్లలో ఒక్కసారి కూడా అధికారులు, మేధావులతో కేసీఆర్ రివ్యూలు చేయలేదని మండిపడ్డారు. ఇంకా ఎన్నేండ్లు ప్రజలను, నిరుద్యోగులను మోసం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ యువత మరో ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రభుత్వం కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మోసం చేసిందని ఆయన గుర్తుచేశారు.