శ్రీనగర్ కాలనీలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

శ్రీనగర్ కాలనీలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

హైదారాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో అర్ధరాత్రి దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. అయితే చోరీ విఫలయత్నం కావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని చేరుకుని ఏటీఎం బ్యాంక్‎ ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని..సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.