
ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆటగాళ్లకు కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ ప్లేయర్ అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న కోల్ కతా ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో నిన్న జరగాల్సిన కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది. చెన్నై కోచ్ లక్ష్మీ పతి బాలాజీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రతి టీంలోనూ వైరస్ బాధితులు పెరుగుతుండటంతో... ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.