కరోనా ఫోర్త్ వేవ్ వస్తోంది.. భయపడాల్సిన అవసరం లేదు

కరోనా ఫోర్త్ వేవ్ వస్తోంది.. భయపడాల్సిన అవసరం లేదు

ఢిల్లీలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ వైరాలజీ డాక్టర్ టి.జాకబ్ జాన్ ను సన్మానించారు భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా,సుచిత్ర ఎల్లా.ఐటీసీ మౌర్య హోటల్ లో పోలియో నిర్మూలపై పోలియో పుస్తక ఆవిష్కరణ జరిగింది. దీర్ఘకాలం సురక్షితంగా,రోగనిరోధక శక్తిని కలిగి ఉండడానికి ఇన్ యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు కృష్ణా ఎల్లా.  కోవిడ్ నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ కూడా ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సినే అన్నారు.భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందని..దాని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.ఇప్పటికే దేశంలో చాలా వరకు వ్యాక్సినేషన్ పూర్తయిందని..ఫోర్త్ వేవ్ వచ్చినా అంత ఇబ్బంది ఉండదన్నారు. 

మరిన్ని వార్తల కోసం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల