పొరపాటు జరిగింది .. క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే

పొరపాటు జరిగింది ..  క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే

బక్రీద్ సందర్భంగా పెట్టిన పోస్టులో జరిగిన పొరపాటుపై క్షమాపణలు చెప్పారు భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలోని తన ఖాతాలో పెట్టిన పోస్ట్ లో పొరపాటు జరిగిందన్నారు. పోస్టర్ లో మేకకు బదులు ఆవు పెట్టారని, అది కావాలని చేసింది కాదన్నారు. జరిగిన పొరపాటును ముస్లిం సోదరులు క్షమించాలన్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో శుభాకాంక్షల ఫోటో తొలగించమని ఆదేశించామన్నారు కుంభం అనిల్. తాను రామ భక్తున్ని  ...  హిందూ ధర్మాన్ని గౌరవించి అనుసరిస్తానని చెప్పారు.   ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా తమ సోషల్ మీడియా విభాగంపై చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వీడియోలో తెలిపారు.