
నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్రం ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తూ పంటలకు మద్దతు ధర పెంచడం హర్షణీయమని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తుందన్నారు. రైతులకు భూసార పరీక్షలు, రైతు పొలాల వద్దకు అంతర్గత రోడ్ల నిర్మాణం, పాల ఉత్పత్తుల్లో అభివృద్ధి కొరకు నూతన డైరీలకు 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు.