కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం

జీడిమెట్ల, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సోమవారం కుత్బుల్లాపూర్​లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్​ను  జగద్గిరిగుట్ట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

ఆయన ఇంటికి పోలీసులు తాళం వేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రీశైలం గౌడ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసులుతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు శ్రీశైలం గౌడ్​ను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.