మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్ లోకి కార్పోరేటర్లు

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్ లోకి కార్పోరేటర్లు

ఎన్నికల వేళ అసంతృప్తి నేతలు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు.  తాజాగా బోడుప్పల్ లో బీఆర్ఎస్ కు పార్టీకి షాక్ తగిలింది.  బోడుప్పల్ కార్పోరేషన్ లో మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐదుగురు  బీఆర్ఎస్ కార్పొరేటర్లు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు.

 గురువారం ఉదయం 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి, 20వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.