జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: కేటీఆర్

జనగామ జిల్లాకు పాపన్న గౌడ్  పేరు పెట్టాలి: కేటీఆర్

రాజ్యాధికారం కోసం పాటుపడిన మహానుభావుడు సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ స్వాతంత్ర్యం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా పోరాటం చేశారన్నారు. పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. 

సర్వాయి పాపన్న మహానీయుడి విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సిరిసిల్ల శాంతినగర్ బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహనికి పూల మాలలు వేసిన అంజలి ఘటించారు కేటీఆర్.