హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో చలిగాలులు వీస్తున్నాయి. నగరంలో అక్టోబర్ 27న సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అంతకుముందు రోజు రాత్రి సమయంలో చలిగాలులు వీచాయి. అది శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. మల్కాజిగిరిలో నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 11.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. శేరిలింగంపల్లిలో 12.1 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్లో 12.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రామచంద్రపురం & పటాన్చెరువులో 12.8 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్, చందానగర్, కుత్బుల్లాపూర్లో వరుసగా 14 డిగ్రీల సెల్సియస్, 14 డిగ్రీల సెల్సియస్, 14.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న రోజుల్లో చలి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అయితే నవంబర్ మధ్య నాటికి ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.