
- పంచాయతీలు, వార్డు ఆఫీసుల్లో దొరుకుతాయన్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్, వెలుగు: అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తులు అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ వార్డు కార్యాలయాల్లో ఫ్రీగా లభిస్తాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కొందరు బ్లాక్లో ఒక్కో ప్రింట్ను రూ.40కు అమ్ముతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతుండటంపై క్లారిటీ ఇచ్చింది. అప్లికేషన్లు ఫ్రీగా లభిస్తాయని, ఎక్కువ డబ్బులు పెట్టి కొని, ప్రజలు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ గురువారం ట్విట్టర్లో పేర్కొంది.
ప్రభుత్వం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు ఫాం నింపాలని, సంబంధిత పత్రాలను అధికారులకే సమర్పించాలని చెప్పింది.