
- సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగిన చింతపండు చోరీ ఘటనలో ఆలయ అధికారులతో ఈవో వెంకటరావు ఏర్పాటు చేసిన 'ఫైవ్ మెన్' కమిటీతో ఫలితం శూన్యమని, అసలు దోషులు బయటపడే అవకాశమే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పేర్కొన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతపండు ఘటనలో ఆలయ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని నిందితుల కుటుంబ సభ్యులు బహిరంగంగా చెప్తుంటే.. అదే ఆలయ అధికారులతో ఫైవ్ మెన్ కమిటీ వేయడమేంటని ప్రశ్నించారు.
చింతపండు ఘటనలో అసలు దోషులను గుర్తించాలంటే.. ఆలయానికి సంబంధం లేని జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీవో, ఏసీపీ, తహసీల్దార్, ఎంపీడీవోతో నూతన కమిటీ వేసి అసలు దోషులను గుర్తించాలని డిమాండ్ చేశారు.