ఢిల్లీలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్

ఢిల్లీలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మళ్లీ పెరిగింది. మోడరేట్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి దిగజారింది. గత రెండు రోజుల నుంచి ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరిలో ఉండగా.. ఇవాళ వెరీ పూర్ కేటగిరికి చేరింది. మరో వైపు ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఒ వైపు పొల్యూషన్ మరోవైపు చలితో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పోల్యూషన్ తో పాటు, చలి కారణంగా సీజనల్ వ్యాధుల బారీన పడుతున్నట్లు ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ తో శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుపుతున్నారు. పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయమేస్తుందని.. పిల్లలు, వృద్ధులు లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.