యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
  • వేసవి సెలవులు దగ్గరపడుతుండడంతో దర్శనానికి తరలివస్తున్న భక్తులు
  • యాదగిరిగుట్టకు 90 వేల మంది, వేములవాడకు 
  • 50 వేల మంది రాక 
  • నారసింహుడికి ఒక్కరోజే రూ. 79.51 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట/వేములవాడరూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు :  వేసవి సెలవులు దగ్గర పడుతుండడంతో ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం యాదగిరిగుట్టతో పాటు వేములవాడలో భక్తుల రద్దీ పెరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీకారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండపైన బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బే పూర్తిగా నిండిపోవడంతో పైకి వాహనాలను నిలిపివేశారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 90 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారావు దర్శించుకున్నారు. 

ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.79,51,701 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.24,71,630, వీఐపీ దర్శనాల ద్వారా రూ.21.30 లక్షలు, ప్రధాన బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ.3,21,400, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8,70,500, బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శనాల ద్వారా రూ.7,85,100, యాదరుషి నిలయం ద్వారా రూ.4,36,282, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,39,200 లక్షలు, కల్యాణకట్ట ద్వారా రూ.2 లక్షల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

లక్ష్మీపుష్కరిణి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సస్పెండ్

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న లక్ష్మీపుష్కరిణి శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బూడిద వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేటు పడింది. ఆదివారం ఈవో వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు కొండ కింద ఉన్న లక్ష్మీపుష్కరిణిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుష్కరిణిలోని వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మారి దుర్వాసన వస్తుండడం, గుండం ఏరియా మొత్తం అపరిశుభ్రంగా ఉండడంతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్ష్మీపుష్కరిణితో పాటు అద్దెగదులు, కల్యాణకట్ట, పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనిగోశాలను తనిఖీ చేశారు. 

కిటకిటలాడిన రాజన్న సన్నిధి

వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం సుమారు 52,492 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. రద్దీ కారణంగా కోడె మొక్కుల టికెట్లు దొరకకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు 
ఎదుర్కొన్నారు.