సెప్టెంబర్ 22న గీత కార్మికుల మహాధర్నా

సెప్టెంబర్  22న గీత కార్మికుల మహాధర్నా

ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఈ నెల 22న ఇందిరా పార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నాను నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటరమణ మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్​లో గీత కార్మికుల సంక్షేమానికి నామమాత్రంగా రూ.30 కోట్లు కేటాయించి.. ఒక్క పైసా విడుదల చేయలేదని మండిపడ్డారు.  మహా ధర్నాకు గీత కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.