ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఈ నెల 22న ఇందిరా పార్క్ వద్ద గీత కార్మికుల మహాధర్నాను నిర్వహిస్తున్నామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటరమణ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నామమాత్రంగా రూ.30 కోట్లు కేటాయించి.. ఒక్క పైసా విడుదల చేయలేదని మండిపడ్డారు. మహా ధర్నాకు గీత కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.