కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు మిస్సింగ్

కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు మిస్సింగ్

బిహార్ లోని భాగల్ పూర్ లో రూ.17వందల కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న తీగల వంతెన కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. ఎస్పీ సింగ్లా కంపెనీలో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు. అతడి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని కోసం SDRF, NDRF బృందాలు వెతుకులాట సాగిస్తున్నాయని సర్కిల్ ఆఫీసర్ చందన్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఇదే విషయంపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి డిమాండ్ చేశారు. ఆయన కాలంలో జరుగుతున్న అవినీతి కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.