గుజరాతీయులను కాంగ్రెస్ అవమానిస్తోంది: హార్దిక్ పటేల్

గుజరాతీయులను కాంగ్రెస్ అవమానిస్తోంది: హార్దిక్ పటేల్
  • కాంగ్రెస్, ఆప్ పార్టీలు గుజరాత్ కల్చర్కు వ్యతిరేకం: విరామ్ గామ్ బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్

గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ మాటలు వినేందుకు సిద్ధంగా లేరని గుజరాత్లోని విరామ్గామ్ బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ అన్నారు. గుజరాతీయులను కాంగ్రెస్ పార్టీ తరచూ అవమానిస్తోందని.. తాను ఆ పార్టీలో నుంచే వచ్చానని గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ వైఖరిని చూసిన  గుజరాత్ ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని అంగీకరించరని అన్నారు. 

 కాంగ్రెస్ పార్టీతోపాటు అమ్ ఆద్మీ పార్టీ  కూడా గుజరాత్ సంస్కృతి, సంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో తాము ఉచిత కరెంట్ ఇస్తామని ఆప్, కాంగ్రెస్ రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేసిన ఆయన ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో ఉచిత కరెంట్ అందిస్తుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో  ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ ఉందని హార్ధిక్ పటేల్ గుర్తు చేశారు.