అన్నను బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లి చనిపోయిన తమ్ముడు

అన్నను బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లి చనిపోయిన తమ్ముడు

భీమదేవరపల్లి, వెలుగు:  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లిలో మంగళవారం ఉదయం  అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లిన ఓ బాలుడు వ్యాన్​ కిందపడి చనిపోయాడు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన దండబోయిన శరత్,  -మమత దంపతులకు ఇద్దరు కొడుకులు.  

పెద్ద కొడుకు శాన్విక్, చిన్న కొడుకు శివాన్ష్(3).  మండలంలోని  గట్ల నర్సింగాపూర్ గ్రామంలోని సర్కారు బడిలో శాన్విక్ యూకేజీ చదువుతున్నాడు.  రోజూ స్కూల్​ బస్సులో వెళ్లి వచ్చేవాడు. ఎప్పటిలాగే అతన్ని బస్సు ఎక్కించేందుకు చిన్న కొడుకు శివాన్ష్ ను వెంటబెట్టుకుని తల్లి మమత  వెళ్లింది. ఈ క్రమంలో శివాన్ష్ ఒక్క సారిగా బస్సు వద్దకు వెళ్లగా, డ్రైవర్ గమనించకుండా బస్సును కదిలించాడు. శివాన్ష్ తలపైనుంచి టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  డ్రైవర్ దాసరి రాజేశ్అజాగ్రత్తగా బస్సు నడపడంతోనే శివాన్ష్ మృతిచెందాడని కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ తెలిపారు. రాజేశ్​ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.