తింటే బిర్యానీనే తినాలి : ఆరు నెలల్లోనే 72 లక్షల ఆర్డర్లు

తింటే బిర్యానీనే తినాలి :  ఆరు నెలల్లోనే 72 లక్షల ఆర్డర్లు

హైదరాబాదీలు గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు చేశారని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ వెల్లడించింది. దాంతో పాటు ఈ సంవత్సరం ఆరంభం నుంచి బిర్యానీ ఆర్డర్ లపై ఓ నివేదిక కూడా రిలీజ్ చేసింది.

గత ఐదున్నర నెలల్లో.. 2022లో ఈ సమయంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్‌లలో 8.39% వృద్ధి కనిపించింది. దమ్ బిర్యానీ హైదరాబాదీల హృదయాలను కొల్లగొట్టి 9 లక్షలకు పైగా ఆర్డర్‌లతో తిరుగులేని ఛాంపియన్‌గా అవతరించింది. 7.9 లక్షల ఆర్డర్‌లతో సువాసనగల బిర్యానీ రైస్‌లలో మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్‌లను అందుకుంది. జనవరి 2023 నుంచి 15 జూన్ 2023 వరకు స్విగ్గీ (Swiggy)లో చేసిన ఆర్డర్‌ల విశ్లేషణ ఆధారంగా ఈ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ ఓ ప్రెస్ నోట్‌లో తెలిపింది.

హైదరాబాద్ లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉన్నందున స్విగ్గీ లాంటి పుణ్యమా అని చాలా మంది చాలా వెరైటీలను ఆస్వాదించగలుగుతున్నారు. నగరంలో ఉన్న దాదాపు 15 వేల కంటే ఎక్కువ ఉన్న రెస్టారెంట్‌లు తమ మెనూలలో బిర్యానీని అందజేస్తున్నాడంటే అతిశయోక్తేం కాదు. కూకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్‌లలో అత్యధికంగా బిర్యానీ అందించే రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఇవి నగరంలోని బిర్యానీ ఔత్సాహికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరుగుతోంది. అందులో ముందజలో కూకట్‌పల్లి ఉండగా ఆ తర్వాత మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ఉన్నాయి.