ముఖం మెరవాలంటే..ఇవి తప్పనిసరి

ముఖం మెరవాలంటే..ఇవి తప్పనిసరి

ఎక్కువ పని చేయడం, ఎండలో బయట తిరగడం,మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అలాగే గాడ్జెట్ల వాడకం పెరగడంతో వాటి నుంచి వచ్చే టెంపరేచర్​, బ్లూ లైట్​ చర్మం మీద నెగెటివ్​గా పని చేస్తాయి. వీటన్నిటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే  నీళ్లు ఎక్కువగా తాగాలి.  పండ్లు, కూరగాయలు, హెల్దీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను తీసుకోవాలి. డైలీ స్కిన్​ కేర్​ రొటీన్స్​ ఉండాలి.  ఫేస్ వాష్, మాయిశ్చరైజర్​​ వంటివి వాడాలి.  షేవింగ్ తర్వాత ఆఫ్టర్ షేవ్ క్రీమ్స్​ వాడటం తప్పనిసరి. మాయిశ్చరైజర్ స్కిన్​ను తడిగా ఉంచుతుంది. డ్రై స్కిన్​ను తగ్గించి ముడతలు రాకుండా అడ్డుపడుతుంది. స్కిన్​ కేర్​ విషయంలో తినే తిండి  చాలా ఇంపార్టెంట్.  ఒక్కమాటలో చెప్పాలంటే...  ప్లేట్‌‌లో ఎక్కువ పండ్లు, కూరగాయలు ఉండాలి.  చక్కెర, ఉప్పును తగ్గించాలి. హెవీ ప్రాసెస్డ్​ ఫుడ్​ను మానేస్తే మరీ మంచిది.  అవిసె గింజలు, కివి, అవకాడో, బచ్చలికూర, పెరుగు  చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.  శరీరాన్ని డిటాక్స్ చేయడానికి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగవచ్చు. కొందరికి గుడ్లు, చికెన్‌‌ తింటే కూడా  స్కిన్​ మీద ఎఫెక్ట్​ పడుతుంది. మొటిమలు వస్తే మంచి ఫేస్ వాష్ వాడి క్లీన్​ చేయాలి. సాలిసిలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న సబ్బులు లేదా ఫేస్​ వాష్​లు వాడితే ఈ ప్రాబ్లమ్​ నుంచి బయటపడొచ్చు. ఫేస్ మాస్క్‌‌లు చర్మాన్ని హైడ్రేట్ చేసి, జిడ్డును తొలగిస్తాయి. మచ్చలు, డార్క్ స్పాట్స్‌‌ ఉంటే  తేనె ఫేస్ మాస్క్‌‌లు బాగా పని చేస్తాయి. తేనె ఫేస్​ మాస్క్​ తయారు చేయడం కూడా చాలా ఈజీ.  రెండు టీస్పూన్ల పచ్చితేనె,  అర టీస్పూన్ నిమ్మరసం ఉంటే చాలు. ఈ రెండింటినీ కలిపి  ముఖానికి అప్లై చేయాలి.  20 నుండి 30 నిమిషాలు ఇలాగే ఉంచుకుని తరువాత శుభ్రంగా కడగాలి.  ఈ మాస్క్​ తరచూ వేసుకుంటే  మచ్చలు తగ్గి స్కిన్​  మెరుస్తుంది.