Hockey World Cup : భారత్‌ దే గెలుపు

Hockey World Cup :  భారత్‌ దే గెలుపు

హాకీ వరల్డ్కప్లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వేల్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4-2 తో విజయం సాధించింది. మ్యాచ్ 21 నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్, 32వ నిమిషంలో ఆకాశ్ దీప్ రెండో గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆ తరువాత 42 ,44 నిమిషంలో వేల్స్  వరుసగా రెండు గోల్స్ కొట్టింది. అనంతరం 59వ నిమిషంలో హర్మన్ ప్రీత్, ఆకాశ్ దీప్  పెనాల్టీ గోల్ కొట్టి  భారత్కు 4-2 తో విజయాన్ని అందించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఆకాశ్‌ దీప్‌ నిలిచాడు.

ప్రస్తుతం గ్రూప్‌లో ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో ఉండగా భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో సమానంగా భారత్  ఏడు పాయింట్లను కలిగి ఉన్నప్పటికి గోల్స్ పరంగా భారత్ వెనుకబడి ఉంది. ఇక ఆదివారం  కళింగ స్టేడియంలో జరిగే క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది.  క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించేందుకు భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది.