అట్టహాసంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్..మెరిసిన తారలు

అట్టహాసంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్..మెరిసిన తారలు

ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా  జరుగుతోంది. వివిధ దేశాల సెటబ్రెటీలు ఈ ఉత్సవాల్లో తళుక్కున మెరిశారు. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకల్లో మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పులువురు ఇండియన్ సెలబ్రెటీస్ పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్, నవాజుద్దీన్, మాధవన్, తమన్నా, ఐశ్వర్వ రాయ్ లు పాల్గొన్నారు. అంతకుముందు  జ్యూరీ మెంబర్ గా వేదికపై చీరకట్టులో మెరిసింది దీపికా పదుకొణె. ఇక రెడ్ కార్పెట్ పై ఊర్వశీ రౌతెల మెరుపులు పూయించింది. 

విక్రమ్ ట్రైలర్ విడుదల కోసం కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కమల్ హాసన్. అదేవిధంగా ఇందులో మాధవన్ నటించిన రాకెట్రి ద నంబి ఎఫెక్ట్ వరల్డ్ ప్రీమియర్ కానుంది. కాగా ఈ ఉత్సవాల్లో భారత్ కు గౌరవ సభ్యదేశం హోదా దక్కింది. ఈ నెల 28వరకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీపికా పదుకొనె కంటే ముందు నందితా దాస్, విద్యాబాలన్, షర్మిల ఠాగోర్,ఐశ్వర్య రాయ్ ఈ గౌరవాన్ని పొందారు.