నేషనల్ బీచ్ కబడ్డీ రెఫరీగా కొంపెల్లి వీరస్వామి

నేషనల్ బీచ్  కబడ్డీ  రెఫరీగా కొంపెల్లి వీరస్వామి

గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి నేషనల్ బీచ్ కబడ్డీ రెఫరీగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం బీచ్ లో ఈనెల 5 నుంచి 8 వరకు నిర్వహించి 12వ జాతీయస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో టెక్నికల్ అఫీషియల్ (అంపైర్) గా వీరస్వామి ఎన్నికైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశం, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్ జాన్సన్ గ్రామర్ స్కూల్ సీబీఎస్ సీ నాచారంలో కబడ్డీ కోచ్ గా వీరస్వామి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వీరస్వామి ఎంపికపై రంగాపురం గ్రామస్తులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.