రైతు నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

రైతు నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

కొమురవెల్లి, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకొంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన లైన్​మన్ ​ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన వీరేందర్ అనే రైతు కొమురవెల్లిలో వ్యవసాయ భూమి కొన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పొలంలో ట్రాన్స్​ఫార్మర్, కరెంట్ లైన్​ఏర్పాటు చేయాలని కొమురవెల్లి సబ్​స్టేషన్​లో అప్లై చేసుకున్నాడు. లైన్​మన్ నాగరాజు అందుకు రూ.15వేల లంచం డిమాండ్ ​చేశాడు. ఇస్తానని నమ్మబలికిన రైతు, తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. కొమురవెల్లిలోని ఓ హోటల్​లో లైన్​మన్​నాగరాజు రైతు వీరేందర్​నుంచి రూ.10వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.