
కొమురవెల్లి, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకొంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన లైన్మన్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన వీరేందర్ అనే రైతు కొమురవెల్లిలో వ్యవసాయ భూమి కొన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పొలంలో ట్రాన్స్ఫార్మర్, కరెంట్ లైన్ఏర్పాటు చేయాలని కొమురవెల్లి సబ్స్టేషన్లో అప్లై చేసుకున్నాడు. లైన్మన్ నాగరాజు అందుకు రూ.15వేల లంచం డిమాండ్ చేశాడు. ఇస్తానని నమ్మబలికిన రైతు, తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. కొమురవెల్లిలోని ఓ హోటల్లో లైన్మన్నాగరాజు రైతు వీరేందర్నుంచి రూ.10వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.