Cricket World Cup 2023: పసికూనలపై పంజా విసిరారు: బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ భారీ స్కోర్

Cricket World Cup 2023: పసికూనలపై పంజా విసిరారు: బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ భారీ స్కోర్

వరల్డ్ కప్ లో తొలి మ్యాచుని ఓటమితో ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో మ్యాచులోనే తమ అసలు సత్తా చూపించింది. కివీస్ పై ఓడిపోయిన పరాజయాన్ని మర్చిపోయేలా పసికూన బంగ్లాదేశ్ పై విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ ఆధ్యంతం తమ దూకుడిని చూపించిన ఇంగ్లాండ్.. బంగ్లాకు బిగ్ టార్గెట్ ని సెట్ చేసింది. 

టాస్ ఓడి  బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు ఇంగ్లాండ్ కి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కి 115 పరుగులు జోడించిన తర్వాత బెయిర్ స్టోని షకీబ్ క్లీన్ బౌల్డ్ చేసాడు. ఇక ఆ తరవాత క్రీజ్ లోకి వచ్చిన రూట్ తో కలిసి మలాన్ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్ కి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి ఇంగ్లాండ్ ని పటిష్ట స్థితికి చేర్చారు. మలాన్ 107 బంతుల్లో 16 ఫోర్లు 5 సిక్సులతో 140 పరుగులు చేసాడు. రూట్ 68 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్సర్ తో 82 పరుగులు చేసాడు. 

ALSO READ : బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది : హరీష్ రావు

ఇక ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా ఆడకపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ కి నాలుగు, షోరిఫుల్ ఇస్లాంకి మూడు వికెట్లు దక్కాయి. తస్కీం అహ్మద్, షకీబుల్ హాసన్ కి చెరో వికెట్ దక్కింది.