హైదరాబాద్, వెలుగు: ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఓపెన్ డే కు శుక్రవారం వేలాది మంది హాజరయ్యారు. “రియల్ లైఫ్లో రిజిలియెన్స్” అనే అంశంపై ప్రారంభమైన సెషన్కు నగరంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు హాజరై చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో, వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిడులు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో ఫ్యూచర్రెడీనెస్, యువతలో గ్రోత్-మైండ్సెట్, సమస్య పరిష్కార దృష్టికోణాన్ని అభివృద్ధి చేయడం తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది.
ఈ సదస్సులో, మాజీ చైర్మన్, యూఐడీఏఐ జి. సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ జితేంద్ర పుచ్చ, చీఫ్ డెలివరీ ఆఫీసర్ మాస్టెక్ డిజిటల్ శ్రీనివాస్ అత్రేయ, సీటీఓ అవికా, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ ఛేదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్స్, రోబో తదితర 27 కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు.
ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపు చివరి రోజైన శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు ఈ గ్లోబల్ సదస్సు ను సందర్సించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నాడు అగ్రికల్చర్, రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ , ఫార్మర్స్ రైజింగ్ అనే అంశంపై సదస్సు జరుగుతుందని వెల్లడించారు.

