నాగార్జున సాగర్ ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

నాగార్జున సాగర్ ను సందర్శించిన  ప్రపంచ సుందరీమణులు

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్   ఇవాళ (మే 12) నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును సంద్శించారు. సాగర్ తీరానా గ్రూప్ ఫోటో షూట్ చేశారు. కాసేపు సరదాగా గడిపారు. మహాస్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బౌద్ధ భిక్షులతో కలిసి ధ్యానం, చాంటింగ్​లో పాల్గొన్నారు. ధ్యాన మందిరంలో కొద్దిసేపు గడిపారు. అనంతరం మహాస్తూపం వెనుక భాగంలోని జాతక వనంలో ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ షో, స్క్రీన్ పై నిర్వహించే డాక్యుమెంటరీని వీక్షించారు.  విజయ్ విహార్ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి అనంతరం డిన్నర్ చేసి  రాత్రి  గంటలకు తిరిగి హైదరాబాద్ కు  చేరుకోనున్నారు.  

 తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ - 2025 పోటీలు శనివారం (మే 10) హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణులకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించారు. మే 13న చార్మినార్​ వద్ద హెరిటేజ్​ వాక్​ నిర్వహించనున్నారు. చార్మినార్​ నుంచి చౌమహల్లా ప్యాలెస్​ వరకు హెరిటేజ్​ వాక్​ కొనసాగుతుంది. ఈ క్రమంలో చార్మినార్​ వద్ద ప్రసిద్ధిగాంచిన మట్టి గాజులు, పెరల్స్​ షాపింగ్​ చేయనున్నారు. అలాగే మే  15న పోచంపల్లికి వెళ్లనున్నారు. 

ప్రపంచ సుందరీమణుల రాకకోసం  నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.  భద్రతా దృష్ట్యా బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్, ఏరియా డామినేషన్ బృందాల చేత విస్తృత తనిఖీలు నిర్వహించింది జిల్లా పోలీసు యంత్రాంగం.  నాగార్జునసాగర్ లో దాదాపు వెయ్యి మంది సిబ్బందితో  పటిష్ఠ బందోదుస్తుకు ఏర్పాటు చేశారు.

పలు  దేశాల నుంచి సుందరీమణులతో పాటు ప్రతినిధులు వస్తున్నందున ఎలాంటి అవాంచనీయా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బుద్ధవనం సందర్శన ప్రాంతాలలో డ్రోన్ల పై నిషేధం విధించారు. బుద్ధవనంతో పాటు అతిథులు రెస్ట్ తీసుకోవడానికి విజయ విహార్ గెస్ట్ హౌస్ ను ఎప్పటికప్పుడు  అన్ని అంశాలను మానిటరింగ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్.