రూ. 200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తం.. అంబానీకి బెదిరింపు

రూ. 200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తం.. అంబానీకి బెదిరింపు

ముంబై: రూ.200 కోట్లు ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు శనివారం తెలిపారు. ముఖేష్ సెక్యూరిటీ ఇన్​చార్జి చేసిన ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, మొదట రూ.20 కోట్లు చెల్లించాలని బెదింరిపు ఈ–మెయిల్ పంపించిన నిందితుడు.. ఆ తర్వాత రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.