పాల ప్యాకెట్లనే కల్తీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు.. మిమ్మల్ని ఏం చేస్తే మారతార్రా..!

 పాల ప్యాకెట్లనే కల్తీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు.. మిమ్మల్ని ఏం చేస్తే మారతార్రా..!

ముంబైలో కల్తీ పాల దందా బయటపడింది. కాందివాలి ఈస్ట్‌లో అముల్, గోకుల్ వంటి ప్రముఖ బ్రాండెడ్ పాలలో నీళ్లు కలుపుతూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సమతా నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఇంటి పై దాడి చేసి, నిందితుడి దగ్గర  ఉన్న 74 లీటర్ల కల్తీ పాలను, నకిలీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న నిందితుడిపై బీఎన్ఎస్, ఫుడ్ సేఫ్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

►ALSO READ | అవి వేర్ హౌస్ లా.. చెత్త కుప్పలా : ఆన్ లైన్ డెలివరీ గోదాముల్లో షాకింగ్ నిజాలు..!

మరోవైపు దేశవ్యాప్తంగానూ ఆహార కల్తీ కలకలం రేపుతోంది. 2025-26 సంవత్సరంలో సేకరించిన ఆహార సాంపుల్స్ లో 40 వేలకు పైగా సాంపుల్స్ నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసుల్లో వేల సంఖ్యలో సివిల్ జరిమానాలు, క్రిమినల్ శిక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.