ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందజేశారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అచంట శరత్ కమల్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ సహా 25 మంది అర్జున అవార్డు అందుకున్నారు.
ఖేల్ రత్న కమల్..
2021కు గానూ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరిచారు.
అర్జున అవార్డు విజేతలు: అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్) సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్. ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్),నిఖత్ జరీన్ (బాక్సింగ్), అమిత్ (బాక్సింగ్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), భక్తి కులకర్ణి (చెస్) ,సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్బాల్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), సరిత (రెజ్లింగ్), అన్షు (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)
ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు: రెగ్యులర్ విభాగంలో కోచ్లకు ఈ అవార్డును కేంద్రం అందిచింది. జీవన్జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), సుమా షిరూర్ (పారా-షూటింగ్), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్),సుజిత్ మాన్ (రెజ్లింగ్)
ద్రోణాచార్య జీవితకాల పురస్కారం: బిమల్ ఘోష్ (ఫుట్బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్),దినేష్ లాడ్ (క్రికెట్)
ధ్యాన్ చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు విజేతలు: ధరమ్వీర్ సింగ్ (హాకీ), అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)
నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ అవార్డు: ట్రాన్స్ స్టేడియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్